ముంచుతున్న మురుగు కాల్వలు
ABN , First Publish Date - 2020-10-30T04:16:24+05:30 IST
చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి.
ఆకివీడు, అక్టోబరు 29: చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి. ముంపు తొలగడానికి కూడా అవకాశం లేక రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు మురుగు కాల్వలతో ఆకివీడు సమతానగర్, సుందరయ్యకాలనీ, పుచ్చలదిబ్బ, సిద్ధాపురం వంతెన కింద, ధర్మాపురం అగ్రహారం ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా ఉప్పుటేరు బ్రిడ్జి దగ్గర పూడికతో ముంపు తొలగడంలేదని పలువురు వాపోతున్నారు.