ప్రతీ డివిజన్లో పొడిచెత్త సేకరణ కేంద్రాలు
ABN , First Publish Date - 2020-05-17T10:45:49+05:30 IST
ప్రతీ డివిజన్లో పొడిచెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం కార్పొరేషన్, మే 16: ప్రతీ డివిజన్లో పొడిచెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగరపాలక సంస్థలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొడిచెత్త సేకరణ కేంద్రాన్ని (డీఆర్సీసీ) మంత్రి ప్రారంభించారు. సేకరించిన పొడిచెత్తను పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో విక్రయిస్తారని మంత్రి చెప్పారు.
దీనివల్ల స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అంతేకాక నగరంలో చెత్తసమస్య సమసిపోతుందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. పొడిచెత్తను రీసైక్లింగ్కు పంపించటం, తడిచెత్తను రీసైక్లింగ్ చేసి ఎరువులుగా మార్చడం జరుగుతుందన్నారు. తడి,పొడి చెత్తసేకరణ ద్వారా రాష్ట్రంలోని సిరిసిల్లలో స్వయంసహాయక సంఘం మహిళలు ఎంతో బలోపేతం అయ్యారని, సిరిసిల్ల తరహాలోనే ఖమ్మం నగరపాలక సంస్థలో మెప్మాను ఉన్నతస్థాయిలో ఉంచటమే తన లక్ష్యమని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు.