కోచ్గా ద్రవిడ్!
ABN , First Publish Date - 2021-05-12T10:54:29+05:30 IST
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత రెండో జట్టుకు కోచ్గా ఎవరిని నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్, ఇంగ్లండ్తో
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత రెండో జట్టుకు కోచ్గా ఎవరిని నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమిండియాతోపాటే ఉంటాడు. దీంతో లంకకు వెళ్లే జట్టుకు కొత్త కోచ్, సహాయక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పదవికి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ను బోర్డు ఎంపిక చేయనుందనే కథనాలు వెలువడుతున్నాయి. అలాగే పారస్ మాంబ్రే కూడా లైన్లో ఉన్నాడు. ఇప్పటికైతే తుది నిర్ణయానికి రాలేదని, త్వరలోనే కెప్టెన్, కోచ్ ఎంపిక జరుగుతుందని బోర్డు అధికారి పేర్కొన్నాడు.