28న డీఆర్‌సీ సమావేశం

ABN , First Publish Date - 2021-06-24T04:54:48+05:30 IST

కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు డీఆర్‌సీ సమావేశం ఉంటుందని కలెక్టర్‌ జి. వీర పాండియన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

28న డీఆర్‌సీ సమావేశం

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 23: కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు డీఆర్‌సీ సమావేశం ఉంటుందని కలెక్టర్‌ జి. వీర పాండియన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19 మేనేజ్మెంట్‌, హౌసింగ్‌ జగనన్న కాలనీలు, హౌసింగ్‌ సైట్స్‌, ఎంఐజీ ప్లాట్‌ డెవలప్‌మెంట్‌ అంశాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

Updated Date - 2021-06-24T04:54:48+05:30 IST