తాగునీటి సమస్య తలెత్తనీయం
ABN , First Publish Date - 2020-05-30T11:26:49+05:30 IST
ఎక్కడా తాగునీటి సమస్యను తలెత్తనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి
గాలివీడు, మే 29: ఎక్కడా తాగునీటి సమస్యను తలెత్తనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నీటిని గాలివీడు మం డలంలోని ప్రతి ఇంటికీ అందిస్తామన్నారు. శుక్రవారం ఆయన తాగునీటి పథకానికి భూమిపూజ చేశారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నూలివీడు తాగునీటి పథకానికి రూ.1.50 కోట్లు, తూముకుంటకు రూ.1.80 కోట్లు, గాలివీడు వాటర్స్కీంకు అదనంగా రూ.20 లక్షల నిధులతో పనులు చేపట్టను న్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో అధికారులతో తాగునీటి సమస్యపై చర్చిం చా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాబ్కా ర్డు కల్గిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ బ్ల్యుఎస్ డీఈఈలు, తహసీల్దార్ రహంతుల్లా, మండల వైసీపీ కన్వీనర్ సుదర్శన్రెడ్డి, మండల వైసీపీ నాయకులు యధుభూషణ్రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగభూషణ్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు వేదమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.