మంగళగిరిలో డ్రైవర్ ఘరానా మోసం
ABN , First Publish Date - 2021-04-11T00:01:44+05:30 IST
అన్నం పెట్టిన ఓనర్లకే కన్నం వేశాడు.వారికి తెలియకుండానే వారిని నిండా ముంచాడు. జిల్లాలోని మంగళగిరి
గుంటూరు: అన్నం పెట్టిన ఓనర్లకే కన్నం వేశాడు.వారికి తెలియకుండానే వారిని నిండా ముంచాడు. జిల్లాలోని మంగళగిరి పట్టణంలో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తనకు పని కల్పించిన ఐదుగురు ఓనర్లను మోసం చేశాడు. ఓనర్లకు తెలియకుండా వారి కార్లను డ్రైవర్ తాకట్టు పెట్టాడు. విషయం ఓనర్లకు తెలిసింది. దీంతో తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధిత ఓనర్లు ఆశ్రయించారు.