ప్రాణహిత తీరంలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-09-27T12:39:48+05:30 IST

కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్‌ కెమెరాలను ...

ప్రాణహిత తీరంలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

బెజ్జూరు, సెప్టెంబరు26: కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో పోలీసుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. శనివారం బెజ్జూరు ఎస్సై సాగర్‌ ఆధ్వర్యంలో ప్రాణహిత నది తీర ప్రాంతంలోని పరిసరాల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించారు. తప్పించుకున్న మావోయిస్టుల బృందం ప్రాణహిత నది దాటే అవకాశం ఉండడంతో డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. మావోయిస్టుల కోసం ప్రాణహిత నది తీర ప్రాంతం, బెజ్జూరు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. 

Updated Date - 2020-09-27T12:39:48+05:30 IST