కర్ణాటకలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా
ABN , First Publish Date - 2021-06-15T09:50:03+05:30 IST
ప్రాణరక్షణకు అవసరమైన మందులను డ్రోన్ల ద్వారా పంపనున్నారు. కొవిడ్ విపత్కాలంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ దేవిశెట్టి సారథ్యంలోని
ప్రాణరక్షణకు అవసరమైన మందులను డ్రోన్ల ద్వారా పంపనున్నారు. కొవిడ్ విపత్కాలంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ దేవిశెట్టి సారథ్యంలోని నారాయణ హెల్త్ సంస్థ ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టనుంది. బెంగళూరులోని థ్రూటల్ ఏరోస్పేసస్ సిస్టమ్ (టీఏఎస్) ద్వారా ఈ నెల 18న చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరులో డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ప్రమాదాలకు తావులేకుండా ఏకబిగిన 100 గంటల పాటు డ్రోన్ల సంచారాన్ని చేపడతారు. ఈ విషయాన్ని నారాయణ హెల్త్ సంస్థ ప్రతినిధి ఒకరు సోమవారం మీడియాకు చెప్పారు. - బెంగళూరు