భీమవరంలో డ్రగ్స్‌ కలకలం.. ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-24T04:35:55+05:30 IST

గుట్టుచప్పుడు కాకుండా ఒక లాడ్జీలో కొందరు యువకులు మత్తు మందు సేవిస్తున్నారన్న సమాచారంతో భీమవరం సెబ్‌ అధికారులు, విజయవాడ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు.

భీమవరంలో డ్రగ్స్‌ కలకలం.. ఇద్దరి అరెస్టు

భీమవరం క్రైం, జనవరి 23 : గుట్టుచప్పుడు కాకుండా ఒక లాడ్జీలో కొందరు యువకులు మత్తు మందు సేవిస్తున్నారన్న సమాచారంతో భీమవరం సెబ్‌ అధికారులు, విజయవాడ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. భీమవరం ఎస్‌ఈబీ సీఐ వర్మ తెలిపిన వివరాలు ప్రకారం.   ఎస్‌ఎస్‌డీ అనే మత్తు మందు కలిగి ఉన్న ఉయ్యాల రోహిత్‌ను అరెస్టు చేసి 8 ఎల్‌ఎస్‌పి స్టాంప్స్‌ సీజ్‌ చేసినట్టు తెలిపారు.సింగుదాసు రిత్విక్‌ నుంచి ఎల్‌ఎస్‌డి స్టాంప్స్‌ 5, ఎండీఎంఎ (మెతాంఫెటమైన్‌) అనే మత్తు మందు ఒక గ్రాము, ఎక్ట్ససీ టాబ్లెట్స్‌ 5, 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరొక కేసులో పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భూపతిరాజు రాజా ఉపేంద్ర మారుతి షిఫ్ట్‌ కారులో 100 గ్రాములు గంజాయి పట్టుకుని అరెస్టు చేశామని తెలిపారు. 

Updated Date - 2022-01-24T04:35:55+05:30 IST