హైదరాబాద్లో డ్రగ్స్ స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-24T01:14:12+05:30 IST
నగరంలో మూడు కిలోల డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు
హైదరాబాద్: నగరంలో మూడు కిలోల డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కొరియర్ కార్యాలయంలో 3 కిలోల డ్రగ్స్ను ఓ వ్యక్తి పార్సిల్ చేసాడు. తమకు అందిన సమాచారంలో కొరియర్ కార్యాలయంలో ఎన్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్సిల్లో ఉన్న మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకు చెందిన వ్యక్తి పార్సిల్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. చెన్నైలో నిందితుడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసారు.