డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-23T01:12:42+05:30 IST
డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
విశాఖపట్నం: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఐఎస్డీ చిప్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బులను బిట్ కాయిన్స్గా మార్చి.. ఇంటర్నెట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నారని సీపీ మనీష్కుమార్ చెప్పారు.
డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ విద్యార్థులకు అమ్ముతున్నారని సీపీ అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.