మితిమీరి మద్యం సేవించి బస్సుకు అడ్డంగా వెళ్లాడు.. దండం పెట్టాడు.. చివరకు..!

ABN , First Publish Date - 2021-07-29T00:35:32+05:30 IST

మితిమీరి మద్యం సేవించి బస్సుకు అడ్డంగా వెళ్లాడు.. దండం పెట్టాడు.. చివరకు..!

మితిమీరి మద్యం సేవించి బస్సుకు అడ్డంగా వెళ్లాడు.. దండం పెట్టాడు.. చివరకు..!

చెన్నై: మందుబాబుల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. మితిమీరి మద్యం సేవించి ప్రజల దయనందన జీవితానికి అడ్డం తిరగడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దిండిగల్ బస్టాండ్ సమీపంలో మందుబాబు బస్సుకు అడ్డంపడ్డారు. బస్సు డ్రైవర్‌కు దండం పెడుతూ సాష్టాంగ పడ్డారు. చాలా సేపు పిచ్చి చేష్టలు చేస్తూ అందరికి విసుగుపుట్టించారు. చాలా సేపటి తర్వాతే పక్కకు జరిగారు. దీంతో బస్సు ఆలస్యమైంది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని దిండిగల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 



Updated Date - 2021-07-29T00:35:32+05:30 IST