మద్యం మత్తులో బస్‌ డ్రైవర్‌పై దాడి

ABN , First Publish Date - 2021-03-21T15:36:38+05:30 IST

మద్యం మత్తులో బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు...

మద్యం మత్తులో బస్‌ డ్రైవర్‌పై దాడి

హైదరాబాద్/ఉప్పల్‌ : మద్యం మత్తులో బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు. బడంగ్‌పేట్‌ వరలక్ష్మికాలనీకి చెందిన నేనావత్‌ జాలయ్య(58) ఆర్టీసీ డ్రైవర్‌. విధుల్లో భాగంగా ప్రయాణికులను ఎక్కించుకున్న బస్సుతో మెహిదీపట్నం నుంచి ఉప్పల్‌కు వెళ్లి ఉప్పల్‌ జంక్షన్‌లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బస్సును ఆపాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆటోడ్రైవర్‌ మహేందర్‌ మద్యం తాగి ఆటో నడుపుకుంటూ వచ్చాడు. రోడ్డుపై బస్సు ఎందుకు ఆపావంటూ డ్రైవర్‌పై దాడిచేశాడు. బస్సు అద్దాలు కూడా ధ్వంసం చేశాడు. బస్‌డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-21T15:36:38+05:30 IST