అర్హులందరికీ బియ్యంకార్డులు: డీఎస్వో

ABN , First Publish Date - 2020-10-25T10:53:51+05:30 IST

ల్లాలో అర్హులందరికీ బియ్యంకార్డులు పంపిణీ చేస్తున్నట్లు డీఎస్వో శివరామప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పౌరసరఫరాల శాఖ ..

అర్హులందరికీ బియ్యంకార్డులు: డీఎస్వో

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 24: జిల్లాలో అర్హులందరికీ బియ్యంకార్డులు పంపిణీ చేస్తున్నట్లు డీఎస్వో శివరామప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెల్లరేషన్‌ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌ దరఖాస్తుల్లేని ఐదుజిల్లాల్లో చిత్తూరు ఒకటన్నారు. జిల్లాలో 1312 వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డుల కోసం, స్ల్పిట్టింగ్‌, అదనపు పేర్ల నమోదుకు 1,30,261 దరఖాస్తులు అందాయని గుర్తుచేశారు. అర్హత మేరకు 95శాతం మందికి అంటే 1,23,993 బియ్యం కార్డులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నవశకం ద్వారా పాత బియ్యం కార్డులు కలిగిన 51,954 మందికి వారంలోగా కొత్తవి పంపిణీ చేస్తామని ఆయన వివరించారు.

Updated Date - 2020-10-25T10:53:51+05:30 IST