రెండో పెళ్లి విషయంలో గొడవపడ్డ భార్యాభర్తలు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఇద్దరికీ దేశ బహిష్కరణ విధించిన కోర్టు

ABN , First Publish Date - 2022-01-19T10:09:43+05:30 IST

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకొని కోర్టుకెక్కారు. ఇద్దరి గాయాలు చూసిన కోర్టు ఆరు నెలలు జైలు శిక్షతోపాటు దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ ఘటన దుబాయ్ దేశంలో జరిగింది...

రెండో పెళ్లి విషయంలో గొడవపడ్డ భార్యాభర్తలు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఇద్దరికీ దేశ బహిష్కరణ విధించిన కోర్టు

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకొని కోర్టుకెక్కారు. ఇద్దరి గాయాలు చూసిన కోర్టు ఆరు నెలలు జైలు శిక్షతోపాటు దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ ఘటన దుబాయ్ దేశంలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన ఆసియా దంపతుల మధ్య అవగాహన లేమి సమస్య ఏర్పడింది. దీంతో ఆ భర్త(24) ఇక తన భార్య(25)తో కలిసి ఉండకూడదని నిర్ణయించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయాన్ని ముందుగా భార్యకు చెప్పాడు. భర్త మాటలు విన్న ఆ భార్య కోపం పట్టలేక భర్తపై దాడి చేసింది. 


భార్య చేసే దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు.  ఆ సమయంలో అతని చేతుల రెండు వేళ్ల ఎముకలు విరిగిపోయాయి. కానీ ఆ భార్య ఇంతటితో ఆగలేదు.. ఇంకా కొట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో యువకుడు కూడా తన భార్యపై ఎదురుదాడి చేశాడు. దీంతో ఆ మహిళ తల, ముక్కు,చెవి, మెడ భాగాలపై దెబ్బలు తగిలాయి.  ఆమెకు కూడా వినికిడి సమస్య ఏర్పడింది.


ఈ ఆలుమగలు తమ జీవిత భాగస్వామిని ఒకరినొకరు గాయపరిచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా కోర్టుకెక్కారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు భార్యభర్తలిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధించింది.

Updated Date - 2022-01-19T10:09:43+05:30 IST