సామాన్యులపై భారం: కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-04-11T06:51:07+05:30 IST
ప్రజల రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరుపతి ఉప ఎన్నికల ద్వారా బుద్ధిచెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
శ్రీకాళహస్తి అర్బన్, ఏప్రిల్ 10: ప్రజల రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరుపతి ఉప ఎన్నికల ద్వారా బుద్ధిచెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ మండ్రకప్ప పాత్రపోషిస్తూ ప్రజలను పీడిస్తున్నారన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ తేలుకొండిలా నిత్యం ప్రజలను కాటేస్తున్నారన్నారు. నూతన ఇసుక విధానంతో రాష్ట్రంలో భవన నిర్మాణరంగం నాశనమైపోయిందన్నారు. జగన్ అసమర్థపాలనతో ఇసుక బంగారమై కేజీలలో కొనాల్సి వస్తోందన్నారు. రాబోయే రోజుల్లో జుట్టు, గడ్డం పెంచినా, గుండు గీయించుకున్నా పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు నిలయమన్నారు. అలాగే దేశానికి బీజేపీ శనిలాంటిదనీ, వైసీపీ, టీడీపీ కేతువులని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బత్తెయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.