దుగ్గిరాల ఎంపీపీ ఎంపిక వివాదం

ABN , First Publish Date - 2021-10-16T19:19:31+05:30 IST

దుగ్గిరాల ఎంపీపీ ఎంపికలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు.

దుగ్గిరాల ఎంపీపీ ఎంపిక వివాదం

గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీ ఎంపికలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ఎదుట ఎంపీపీ అభ్యర్థి జబీన్, టీడీపీ నేతలు బైఠాయించారు. తక్షణమే దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దుగ్గిరాల ఎంపీపీ జబీన్ కుల ధ్రువపత్రం విషయంలో వివాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి కుల ధ్రువీకరణపై కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ధ్రువపత్రాల ఆధారంగా జబీన్ బీసీ కాదని కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గతంలో తహశీల్దార్ ఇచ్చిన నివేదికను కలెక్టర్ సమర్థించారు. హైకోర్టుకు కలెక్టర్ వివేక్ యాదవ్ నివేదికను పంపించారు.

Updated Date - 2021-10-16T19:19:31+05:30 IST