దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలు బేఖాతరు
ABN , First Publish Date - 2021-10-09T20:52:06+05:30 IST
దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలను భేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలను మాత్రమే అంతరాలయంలోకి అనుమతిస్తారు.
విజయవాడ: దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలను మాత్రమే అంతరాలయంలోకి అనుమతిస్తారు. అయితే వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్ధానం, ఇతర శాఖల అధికారులు తోడ్కొని వెళ్తున్నారు. 300 రూపాయల టిక్కెట్ వారికి బయటనుంచి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు పెదవి విరుస్తున్నారు. అంతరాలయంలో రద్దీతో క్యూలైన్లలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వ్యవహారంపై శుక్రవారం కలెక్టర్ సీరియస్ అయినా అధికారులు పట్టించుకోలేదు. దుర్గగుడిలో అధికారుల తీరుపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ వాకబు చేసినట్లు చెబుతున్నారు.