ఆన్లైన్లో దుర్గా పూజలు... ఆర్డర్పై ఇంటికే ప్రసాదం!
ABN , First Publish Date - 2020-10-21T15:01:05+05:30 IST
కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు పలు...
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు పలు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇదే కోవలో ప్రస్తుతం జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలను పలు నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో ఆన్లైన్ దర్శనాలు కొనసాగుతున్నాయి. అలాగే ఆన్లైన్లో పూజలు చేయించుకున్నవారి ఇంటికే ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే దుర్గా మండపాలలో పూజలు చేసే పూజారులకు కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే మండపాలు ఏర్పాటు చేసే వారికి కూడా కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. దుర్గామండపాలకు పరిమత సంఖ్యలోనే భక్తుల హాజరుకు అనుమతిస్తున్నారు.