భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-15T06:36:21+05:30 IST
నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల ను గురువారం పట్టణంలో ఘనం గా శోభాయాత్ర నిర్వహించారు.
ఆదిలాబాద్టౌన్, అక్టోబరు 14: నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల ను గురువారం పట్టణంలో ఘనం గా శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక బొజ్జవార్ టెంపుల్లోని అమ్మవారి విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభంకాగా మహిళలు హారతులతో పాల్గొన్నారు. అంతకు ముం దు అమ్మవారి విగ్రహ నిమజ్జనానికి తరలించే క్రమంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు.