AP: ఇంద్రకీలాద్రిపై అపచారం
ABN , First Publish Date - 2021-10-13T17:31:18+05:30 IST
దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటుచేసుకుంది.
విజయవాడ: దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి సమర్పించేందుకు శ్రీకాళహస్తి నుండి ఆలయ సిబ్బంది సారే తీసుకువచ్చింది. అయితే సారేను అర్చకులు భక్తులు నడిచే నేలపై ఉంచారు. భక్తులు నడిచే మార్గంలో సారె, పూజా సామాగ్రి ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.