లాక్‌డౌన్‌ వేళ.. విందులో గొడవ

ABN , First Publish Date - 2021-05-19T05:13:16+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ.. విందులో గొడవ

లాక్‌డౌన్‌ వేళ.. విందులో గొడవ

బషీరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లఘించి విందుకు హాజరవడమే కాకుండా ఇరువురు వ్యక్తులు గొడవకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటన బషీరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బషీరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన హోటల్‌ రాములు స్థానికంగా ఒకరి విందుకు హజరయ్యారు. అక్కడున్న పూడూరు శ్రావణ్‌కుమార్‌ తనను పిలిచి అసభ్యంగా తిడుతూ అందరి సమక్షంలో కాలితో తన్నినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాములు విందులో అవహేళనగా మాట్లాడటంతో పాటు తన ఇంటిపైకి వచ్చి తిడుతూ హంగామా చేశాడని శ్రావణ్‌కుమార్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పరస్పరం వచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. 

Updated Date - 2021-05-19T05:13:16+05:30 IST