దసరా శోభ

ABN , First Publish Date - 2020-10-25T10:39:27+05:30 IST

దసరా వచ్చేసింది. పండగ శోభతో శనివారం మార్కెట్‌ కిటకిటలాడింది. అమ్మవారి పూజా సామగ్రి కొనుగోళ్లతో దుకాణాలు నిండుగా కనిపించాయి.

దసరా శోభ

కిటకిటలాడిన మార్కెట్‌ 

అమ్మవారికి మహర్నవమి పూజలు


విజయనగరం రూరల్‌, అక్టోబరు 24: దసరా వచ్చేసింది. పండగ శోభతో శనివారం మార్కెట్‌ కిటకిటలాడింది. అమ్మవారి పూజా సామగ్రి కొనుగోళ్లతో దుకాణాలు నిండుగా కనిపించాయి. గంటస్తంభం రోడ్డు, కోట, కన్యకాపరమేశ్వరీ రోడ్డు, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రాంతాలు కోలాహలంగా కనిపించింది. రద్దీ కారణంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పూలు, పండ్లు, పూజా సామగ్రి ధరలు పెరిగాయి. జిల్లా ప్రజలు మహర్నవమి పర్వదినాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. దుర్గాదేవి ఆలయాల్లో శనివారం విశేష పూజలు చేశారు. విజయనగరంలో పైడిమాంబ, కన్యకాపరమేశ్వరి, జ్ఞానసరస్వతి ఆలయాలతో పాటు కొత్తపేట దుర్గాదేవి, దాసన్నపేటలోని కాళీమాత, పాతబస్టాండ్‌లోని దుర్గాదేవి ఆలయాల్లోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శంకరమఠం తదితర ప్రాంతాల్లో కుంకుమార్చనలు జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T10:39:27+05:30 IST