కేంద్ర ఉద్యోగులకు 26న దసరా సెలవు

ABN , First Publish Date - 2020-10-22T07:52:22+05:30 IST

రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు.

కేంద్ర ఉద్యోగులకు 26న దసరా సెలవు

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా ప్రకటించింది.

కేంద్రం మాదిరిగానే 26న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సంఘం బుధవారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాసింది.  


Updated Date - 2020-10-22T07:52:22+05:30 IST