ద్వారకాతిరుమల వేంకటేశ్వరుడికి అవభృదోత్సవం

ABN , First Publish Date - 2021-10-22T05:03:45+05:30 IST

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్ధానంలో ఆశ్వ యుజమాస తిరు కల్యాణ మహో త్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ద్వారకాతిరుమల వేంకటేశ్వరుడికి అవభృదోత్సవం

ద్వారకాతిరుమల (జంగారెడ్డిగూడెం), అక్టోబరు 21: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్ధానంలో ఆశ్వ యుజమాస తిరు కల్యాణ మహో త్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో  స్వామి వారిని దర్శించుకుంటున్నారు. గురువా రం ఉదయం ఆలయ పండితులు, అర్చకులు శ్రీచక్రవారి అవభృదోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శ్రీచక్ర పెరుమాళ్లును సింహా సనంపై ఉంచారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చందనోదకం, సుగంద ద్రవ్యాల అభిషేక జలంతో చక్రపెరుమాళ్లును అభిషేకించారు. స్వామి, అమ్మవార్లను అలంకరించి హారుతులిచ్చారు. రాత్రి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజా రోహణ కార్యక్రమాలను కన్నుల పండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించారు.

Updated Date - 2021-10-22T05:03:45+05:30 IST