నేటి నుంచి ఈ- ఆఫీస్‌ అమలు

ABN , First Publish Date - 2020-08-15T10:11:13+05:30 IST

జిల్లాలో నేటి నుంచి ‘ఈ - ఆఫీస్‌’ పాలనను అమలుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ తెలిపారు.

నేటి నుంచి ఈ- ఆఫీస్‌ అమలు

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు-14: జిల్లాలో నేటి నుంచి  ‘ఈ - ఆఫీస్‌’ పాలనను అమలుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఈ ఆఫీస్‌ ప్రక్రియను కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కలెక్టర్‌ కార్యాలయంతో పాటు జడ్పీ, డీఆర్డీఏ, ఖమ్మం, కల్లూరు ఆర్డీవో కార్యాలయాల్లో ఈ ఆఫీస్‌ పాలన ప్రారంభం అవుతుందన్నారు.


ఆగస్టు 20నాటికి జిల్లాలోని అన్ని శాఖల జిల్లాస్థాయి మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ ఆఫీస్‌ పాలన ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ ఆఫీస్‌ పాలనపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ ఆఫీస్‌ ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మెగిలి, ఎన్‌.మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌, ఐడీ డిప్యూటీ తహాసీల్దారు ఖాసీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:11:13+05:30 IST