ఎంసెట్‌కు 45 శాతం మార్కుల నిబంధన తొలగించాలి

ABN , First Publish Date - 2020-08-04T09:46:50+05:30 IST

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45

ఎంసెట్‌కు 45 శాతం మార్కుల నిబంధన తొలగించాలి

రాంనగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు సాధించిన వారే అర్హులనే నిబంధనను ఉపసంహరించాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి రాము సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వారిని 35 శాతం మార్కులతో ప్రభుత్వం పాస్‌ చేసిందన్నారు. 45 శాతం నిబంధన వల్ల 80 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌ రాయలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2020-08-04T09:46:50+05:30 IST