తొలితరం సీపీఐనేత జీపాళెం రామనాథరెడ్డి మృతి

ABN , First Publish Date - 2021-04-19T06:56:29+05:30 IST

జిల్లాలోని తొలితరం కమ్యూనిస్టు పార్టీ నేత జీపాళెం రామనాథరెడ్డి(94) మృతి చెందారు

తొలితరం సీపీఐనేత జీపాళెం రామనాథరెడ్డి మృతి

తిరుపతి(ఆటోనగర్‌), ఏప్రిల్‌ 18: జిల్లాలోని తొలితరం కమ్యూనిస్టు పార్టీ నేత జీపాళెం రామనాథరెడ్డి(94) మృతి చెందారు. కరోనా బారినపడి కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సీపీఐ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యవర్గ సభ్యుడు హరినాథ్‌రెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-04-19T06:56:29+05:30 IST