జమ్మూకశ్మీర్లో భూప్రకంపనలు
ABN , First Publish Date - 2020-07-08T18:44:10+05:30 IST
జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది.....
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లోనూ...
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ నగరానికి తూర్పున 71 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.