అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

ABN , First Publish Date - 2020-10-21T13:08:59+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలో బుధవారం భూకంపం....

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

చాంగ్ లాంగ్ (అరుణాచల్ ప్రదేశ్): అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. చాంగ్ లాంగ్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో బుధవారం తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. భూకంపం 15కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు చెప్పారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. తెల్లవారుజామున జనం భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated Date - 2020-10-21T13:08:59+05:30 IST