అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం... 4.3 తీవ్రత నమోదు!
ABN , First Publish Date - 2021-08-03T16:03:18+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్...
పోర్ట్బ్లెయిర్: కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదు. గత ఫిబ్రవరి 15న పోర్ట్బ్లెయిర్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.1గా నమోదయ్యింది.