న్యూజీలాండ్లో సునామీ హెచ్చరిక ఎత్తివేత
ABN , First Publish Date - 2021-03-05T15:46:57+05:30 IST
న్యూజీలాండ్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ జారీ చేసిన సునామీ హెచ్చరికను శుక్రవారం ఎత్తివేసింది.....
వెల్లింగ్టన్: న్యూజీలాండ్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ జారీ చేసిన సునామీ హెచ్చరికను శుక్రవారం ఎత్తివేసింది.న్యూజీలాండ్ లో బలమైన భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరిక జారీతో సముద్ర తీరప్రాంతాల్లో వేలాదిమందిని ఖాళీ చేయించారు. భూకంపం అనంతరం కొద్దిగంటల తర్వాత తక్కువ నష్టం జరిగింది.సునామీ ముప్పుతో న్యూజీలాండ్ దేశంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. గిస్బోర్న్ సమీపంలోని టోకోమారుబే వద్ద చిన్న తరంగాల వీడియోలను స్థానికులు రికార్డు చేశారు.అతిపెద్ద భూకంపం అనంతరం ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించారు.సునామీ ముప్పు తొలగిపోయిందని ప్రకటించడంతో ప్రజలు మళ్లీ వారి స్వస్థలాలకు తరలివచ్చారు.