Indonesiaలో తీవ్ర భూకంపం...సునామీ ముప్పు లేదు

ABN , First Publish Date - 2021-11-11T12:51:00+05:30 IST

ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది....

Indonesiaలో తీవ్ర భూకంపం...సునామీ ముప్పు లేదు

జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఇండోనేషియాలోని కైమానా జిల్లాలో సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో కేంద్రంగా భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాస్త్ర,జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.ఈ భారీ భూకంపం వల్ల ఆస్తినష్టం వివరాలు తెలియలేదు. తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియాలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు. 


Updated Date - 2021-11-11T12:51:00+05:30 IST