కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2020-06-05T15:54:24+05:30 IST

కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది....

కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ : కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో, జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. హంపీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. జంషెడ్ పూర్ నగరంలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. ఈ భూప్రకంపనలతో హంపీ, జంషెడ్ పూర్ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. 


మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. గద్దలగుంట, విజయ్‌నగర్‌ కాలనీ, మామిడిపాలెం, దేవుడిచెరువు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. 

Updated Date - 2020-06-05T15:54:24+05:30 IST