AP: శబరి, గోదావరి నదులలో పెరుగుతున్న నీటిమట్టం
ABN , First Publish Date - 2021-09-30T13:35:52+05:30 IST
భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని శబరి, గోదావరి నదులలో నీటి మట్టం పెరుగుతోంది.
రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని శబరి, గోదావరి నదులలో నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కూనవరం వద్ద వరద ముఫ్ఫై తొమ్మిది అడుగులకు చేరింది. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్ వే పైన వరదనీరు చేరడంతో పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకులేరు వాగు రహదారిపైకి చేరడంతో వి.ఆర్.పురం, చింతూరు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వరదలతో వరి మిర్చి పంటలు ముంపుకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.