East godavari జిల్లాలో కోడి పందాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-14T18:22:33+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట ప్రారంభమయ్యాయి.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు, గుండాట ప్రారంభమయ్యాయి. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వయంగా కోడి పందాలను రిబ్బన్ కట్ చేసి మొదలుపెట్టారు. కాకినాడ రూరల్లో స్థానిక మంత్రి మద్ధతుతో యథేచ్ఛగా పందాలు జరుగుతున్నాయి. కాట్రానికోనలో రాష్ట్ర స్థాయి పందాలు భారీ ఏర్పాట్ల మధ్య మొదలయ్యాయి.