రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-14T18:45:02+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నరసింహపురం గ్రామానికి చెందిన ముచ్చిక రామకృష్ణ (26), ముడివి సీతయ్య (36)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-14T18:45:02+05:30 IST