బర్త్‌డే పేరుతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-06-16T17:54:34+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పట్టణంలో బర్త్‌డే పేరుతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.

బర్త్‌డే పేరుతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పట్టణంలో బర్త్‌డే పేరుతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వందల మంది కత్తులతో ర్యాలీగా హల్‌చల్ చేశారు. ఊరంతా తిరుగుతూ అరుపులు కేకలతో కత్తులు చేతబూని పోలీస్ స్టేషన్ ఎదుట కేక్ కటింగ్ చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతి ఐదో వార్డుకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ కొడుకు దుర్గాప్రసాద్ అలియాస్ చంటి పుట్టిన రోజు కావడంతో పోలీసులు సహకారం అందించారు. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పట్టణం మొత్తం అనుచరులతో కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు మాజీ రౌడి షీటర్లు కూడా పొడవాటి కత్తులు, తల్వార్లు చేతబట్టుకుని ఊరంతా అరుపులు కేకలతో రెచ్చిపోయారు. వైసీపీ నేతల హంగామాతో బెంబేలెత్తిపోయిన ప్రజలు పరుగులు తీశారు. 

Updated Date - 2021-06-16T17:54:34+05:30 IST