సమర్ధవంతంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ

ABN , First Publish Date - 2021-03-06T05:57:10+05:30 IST

ఏలేశ్వరం, మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏలేశ్వరంలో పర్యటించిన ఆయన అధికారులతో కలసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధిం

సమర్ధవంతంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ
ఏలేశ్వరంలో అధికారులకు సూచనలిస్తున్న అంబేడ్కర్‌

జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌

ఏలేశ్వరం, మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏలేశ్వరంలో పర్యటించిన ఆయన అధికారులతో కలసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో, కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని.. స్ర్టాంగ్‌రూం, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌,  కౌంటింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేయడంతో పా టు అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌, ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, ఆర్‌ఐ పొన్నాలు, బి.రామ కృష్ణ, ప్రయాగమూర్తి, సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T05:57:10+05:30 IST