ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావుపై ఈటల సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-06-30T19:56:11+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావుపై ఈటల సంచలన వ్యాఖ్యలు

హుజూరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. కేసీఆర్‌తో పాటు ప్రభాకర్ రావుపై కామెంట్స్ చేశారు. ‘‘ప్రభాకర్ రావు.. నువ్వ చట్టానికి లోబడి పని చేస్తున్నావా?.. చుట్టాలనికి లోబడి పని చేస్తున్నావా?.. కేసీఆర్ చుట్టం లెక్క పని చేస్తే ఒప్పుకోము. వందల మంది ఇంటలిజెన్స్ అధికారులు హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు. నువ్వు రాజకీయాలు చేయాలంటే గులాబీ కండువా కప్పుకో. మీ ఇజ్జత్ పోతోంది. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్య పడుతున్నారు. ఎన్నికల అప్పుడు ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు.’’ అంటూ ఈటల వ్యాఖ్యానించారు. ఈటల గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుందని బయట ఉన్నవారు చెప్తున్నారని పేర్కొన్నారు.


సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ..‘‘కేసీఆర్ ఫోటోలు ఫ్లెక్సీలు, గోడల మీదనే ఉంటాయి. అవి నాలుగు రోజులు ఉంటాయి. తర్వాత పోతాయి. గెలిచేది నేనే. అటు వైపు పది మంది టికెట్స్ కోసం కొట్లాడుతున్నారు. వడ్లు కొనండి అని చెప్పిన. అది తప్పా?.. అది తిరుగుబాటా?.. 88 సభ్యులు ఉన్నా మళ్లీ కొత్తవారిని ఎందుకు చేర్చుకున్నారు? కేసీఆర్ కుట్ర దారు. నేను ప్రజల కోసం పని చేస్తా’’ అని ఈటెల పేర్కొన్నారు.

Updated Date - 2021-06-30T19:56:11+05:30 IST