ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి: సుజనా

ABN , First Publish Date - 2020-05-24T02:00:03+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. ప్రధాని మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో మనం మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి: సుజనా

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. ప్రధాని మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో మనం మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు. మోదీ రూ.20లక్షల కోట్లతో అతి పెద్ద రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. ప్యాకేజీతో పేదలు, రైతులు, చిరు వ్యాపారులకు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. సుజనా ఫౌండేషన్ తరపున తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లతో సహాయక కార్యక్రమాలు చేపట్టామని సుజనాచౌదరి తెలిపారు.

Updated Date - 2020-05-24T02:00:03+05:30 IST