అనిల్ దేశ్‌ముఖ్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ABN , First Publish Date - 2021-07-16T22:53:58+05:30 IST

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు..

అనిల్ దేశ్‌ముఖ్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ముంబై: అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.20 కోట్లు విలువచేసే స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారంనాడు జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను సీజ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో వోర్లిలోని రూ.1.54 కోట్లు విలువచేసే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరన్‌లో 2.68 కోట్ల బుక్ వాల్యూ కలిగిన స్థలాలు ఉన్నట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.


రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో బార్ ఓనర్ల నుంచి అక్రమంగా రూ.4.70 కోట్ల ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలను దేశ్‌ముఖ్ ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ సొమ్మును శ్రీ సాయి శిక్షణ సంస్థ పేరుతో ఉన్న ట్రస్టుకు వచ్చిన నిధులుగా దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు చూపిస్తున్నట్టు ఈడీ అంటోంది. ఈ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ పలాండే, ప్రైవేట్ అసిస్టెట్ కుందన్ షిండేలను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఓవైపు సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.

Updated Date - 2021-07-16T22:53:58+05:30 IST