సుశాంత్ కేసు: రెండోసారి రియా చక్రవర్తిని విచారిస్తున్న ఈడీ

ABN , First Publish Date - 2020-08-10T19:40:37+05:30 IST

సుశాంత్ డెత్ మిస్టరీ కేసులో నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది.

సుశాంత్ కేసు: రెండోసారి రియా చక్రవర్తిని విచారిస్తున్న ఈడీ

ముంబై: సుశాంత్ డెత్ మిస్టరీ కేసులో నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రియా చక్రవర్తి సోమవారం రెండోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె తన సోదరుడితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వచ్చారు. సుశాంత్ మరణంతో మనీ ల్యాండరింగ్ వ్యవహారం ముడిపడి ఉందన్న అనుమానంతో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.


సుశాంత్ ప్రియురాలు.. నటి రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం 8 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె ఆదాయ, పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబై నగరంలోని ఘర్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్థికి సంబంధించి రియా చక్రవర్తిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సుశాంత్ నుంచి తీసుకున్న డబ్బుతో ఈ స్థిరాస్తిని రియా కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రియా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలియవచ్చింది. ఈ సమాధానాలతో సంతృప్తి చెందకపోవడంతో ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు పిలిచారు.

Updated Date - 2020-08-10T19:40:37+05:30 IST