మార్కెట్‌లో ఎడిబుల్‌ టీ కప్‌

ABN , First Publish Date - 2020-07-13T10:40:36+05:30 IST

ఎడిబుల్‌ టీ కప్పుకు దేశమంతా మంచి స్పందన వచ్చింద ని ఎడ్కో ఇండియా ఫౌండర్‌ రోహన్‌ పమ్నానీ అన్నా రు.

మార్కెట్‌లో ఎడిబుల్‌ టీ కప్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎడిబుల్‌ టీ కప్పుకు దేశమంతా మంచి స్పందన వచ్చింద ని ఎడ్కో ఇండియా ఫౌండర్‌ రోహన్‌ పమ్నానీ అన్నా రు. బెంగళూర్‌ ఆర్‌వీ కాలేజీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశానని రోహన్‌ పమ్నానీ తెలి పారు. తమ తండ్రి రాజేష్‌ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌డీ ఇంజనీర్స్‌లో సహాయపడ్డానని ఆయన చెప్పా రు. వినూత్నంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఆర్‌అండ్‌డీని కంపెనీ ప్రారంభించి టీ కప్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.


ప్రజల ఆరోగ్యానికి భరోసాతో పాటు పర్యావరణానికి మేలు కలిగించేం దుకు శ్రీకారం చుట్టాం. తమ కంపెనీలో ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఆమె(తన్వి పమ్నానీ) సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె సూచనలతోనే విభిన్నంగా వీటిని తయారు చేయగలిగామన్నారు. ఎడ్కో ఇండియా బ్రాండ్‌తో వీటిని అందిస్తున్నట్టు రోహన్‌ పమ్నానీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఈ టీ కప్పులను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామ న్నారు. ఇప్పటికే పలు టీ, కాఫీ చైన్స్‌తో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-07-13T10:40:36+05:30 IST