విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-08-28T03:59:48+05:30 IST
ప్రభుత్వం విద్యారంగ సమ స్యలు పరిష్కరించాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జునలు పేర్కొ న్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రారంభించిన మోటార్ సైకిల్ యాత్ర శనివారం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. యాత్రకు జిల్లా కార్యదర్శిని సబ్బని రాజేంద్ర ప్రసాద్ స్వాగ తం పలికారు. కన్నాల బస్తీలోని అమరవీ రుల స్ధూపం వద్ద నివాళులర్పించారు. గురు కుల హాస్టళ్లను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 27: ప్రభుత్వం విద్యారంగ సమ స్యలు పరిష్కరించాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జునలు పేర్కొ న్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రారంభించిన మోటార్ సైకిల్ యాత్ర శనివారం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. యాత్రకు జిల్లా కార్యదర్శిని సబ్బని రాజేంద్ర ప్రసాద్ స్వాగ తం పలికారు. కన్నాల బస్తీలోని అమరవీ రుల స్ధూపం వద్ద నివాళులర్పించారు. గురు కుల హాస్టళ్లను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ స్కాలర్షిప్లు, ఫీజు రీయిం బర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకుం డా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిం చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, ప్రగతి భవన్ను ముట్టడిస్తామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు అరుణ్, రాజశేఖర్, ఆకాష్, వెంకటేష్, రమేష్, సాయి, స్రవంతి పాల్గొన్నారు.