విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి: లోకేష్‌

ABN , First Publish Date - 2021-11-11T22:18:44+05:30 IST

ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడేందుకు విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని టీడీపీ నేత లోకేష్‌ పిలుపునిచ్చారు.

విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి: లోకేష్‌

అమరావతి: ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడేందుకు విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని టీడీపీ నేత లోకేష్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ జయంతిని జాతీయ విద్యా దినంగా జరుపుకుంటున్నామన్నారు. ఇలాంటి రోజున కూడా ఏపీలో విద్యార్థులు తమ భవిష్యత్‌ కోసం.. రోడ్లపైకి వచ్చి పోరాటం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మైనార్టీల హక్కుల సంరక్షణకు కలామ్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ముస్లిం మైనార్టీల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్‌ తెలిపారు.

Updated Date - 2021-11-11T22:18:44+05:30 IST