హుజూరాబాద్లో ఈటలదే గెలుపు
ABN , First Publish Date - 2021-10-28T04:07:41+05:30 IST
హుజూరాబాద్లో ఈటలదే గెలుపు
- బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్
శంషాబాద్రూరల్: హుజూరాబాద్లో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మోజర్టీతో గెలవడం ఖాయమని బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో బుధవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తండగా శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నేత బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో నేతలు ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అంతకుముందు విమానాశ్రయంలో తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ననావల్ల కుమార్యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్క ప్రవీణ్కుమార్, ఊట్పల్లి కౌన్సిలర్ కొండా ప్రవీణ్గౌడ్, మాధవరెడ్డి, అశోక్, ఎం.కుమార్, ప్రకాష్, మల్లే్షయాదవ్, మహేష్, ప్రశాంత్రెడ్డి, కిట్టు, వినోద్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.