దిష్టిబొమ్మల దహనాలు

ABN , First Publish Date - 2022-02-10T06:30:26+05:30 IST

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నిరసనలు అందోళనతో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా భగ్గుమంది.

దిష్టిబొమ్మల దహనాలు
సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

 - మోదీ తీరుపై భగ్గుమన్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నిరసనలు అందోళనతో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా భగ్గుమంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, తెలంగాణపై చూపుతున్న వివక్షతను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌నాయకులు మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ తీరును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మానేరు బ్రిడ్జి నుంచి గులాబీ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ అంభేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకోని ధర్నా నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు   


Updated Date - 2022-02-10T06:30:26+05:30 IST