మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2020-07-09T12:03:34+05:30 IST

మునిసిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం నాగారం మున్సిపాలిటీ ..

మౌలిక వసతుల కల్పనకు కృషి

 కీసర రూరల్‌: మునిసిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు  మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం నాగారం మున్సిపాలిటీ ఆంధ్రాబ్యాంకు సమీపంలో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో మౌలిక వసుతుల కల్పనకు అధిక నిదులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా పార్కుల అభివృద్ధితో పాటు ప్రజా మరుగుదొడ్లు, సీసీరోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నాగారం మున్సిపల్‌ పరిధిలో జనసంచారం అధికంగా ఉండే నాలుగు చోట్ల ప్రజా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మల్లేష్‌యాదవ్‌, కమిషనర్‌ వాణి, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్‌గౌడ్‌, కౌకుట్ల అనంతరెడ్డి, నాయకులు ఆంజనేయులుగౌడ్‌, అన్నంరాజ్‌ సురేష్‌, కౌకుట్ల కృష్ణారెడ్డి, దయాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T12:03:34+05:30 IST