జిల్లా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి
ABN , First Publish Date - 2020-06-06T10:14:06+05:30 IST
జిల్లా ఆస్పత్రిగా గద్వాల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి స్ధాయి పెంచిన తర్వాత కావాల్సిన మౌలిక సదుపాయాలు
జడ్పీ చైర్పర్సన్ సరిత
గద్వాల క్రైం, జూన్ 5 : జిల్లా ఆస్పత్రిగా గద్వాల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి స్ధాయి పెంచిన తర్వాత కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని జడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు.
జిల్లా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపటైటిస్ చికిత్స కేంద్రం, చిన్నపిల్లల వార్డు, కోవిడ్ ప్రత్యేక వార్డులను శుక్రవారం కలెక్టర్ శృతి ఓఝా, ఎమ్యెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. మౌలిక సదుపాయాల వల్ల జిల్లా ప్రజలకు మరింత సేవలందించేందుకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, మునిసిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, డీఎంహెచ్ఓ భీంనాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శోభారాణి, తహసీల్దార్ మంజల, వైద్యులు ఉన్నారు.